సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరో లేఖ

-

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మరో లేఖ రాశారు. ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకం రాష్ట్ర వాటా పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆదిలాబాద్ లోని RGIMS నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ లో ఉన్న రాష్ట్ర షేర్ ని వెంటనే ఇవ్వాలని లేఖ లో పేర్కొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

ప్రధాన మంత్రి స్వాస్థ సురక్ష యోజన పథకం కింద రాష్ట్రం నుంచి వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ, ఆదిలాబాద్ RGIMS గుర్తించి ఒక్కో కాలేజీకి రూ. 120 కోట్లు కేంద్రం కేటాయించిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం తన వాటా ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు సీఎం కేసీఆర్‌ కు రాసిన లేఖలో క్లియర్‌ గా పేర్కొన్నారు కిషన్ రెడ్డి. అలాగే… సిబ్బంది ని కూడా తీసుకో వాలని కోరిన కిషన్‌రెడ్డి… రెండు వైద్య విద్యా సంస్థల సేవలను ప్రారంభించాలని లేఖలో విన్న వించారు. దీనిపై సీఎం కేసీఆర్‌ త్వరగా స్పందించాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news