సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడా.. టీడీపీ బీ పార్టీ అధ్యక్షుడా…?- కొడాలి నాని

-

మత కలహాలను రెచ్చగొట్టాలని… ప్రశాంత వాతావరణాన్ని రెచ్చగొట్టాలని చూస్తే  ప్రభుత్వం, పోలీసులు చూస్తూ ఊరుకోదని బీజేపీ పార్టీని హెచ్చరించారు మంత్రి కోడాలి నాని. సోము వీర్రాజు బీజేపీకి అధ్యక్షుడా..? టీడీపీకి అధ్యక్షుడా..? అని ప్రశ్నించారు.  టీడీపీ ట్రాప్ లో బీజేపీ పడకూడదని హితవు పలికారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా వ్యవహరించాలని సోము వీర్రాజుకి సూచించారు. దేశం అంతా కూడా ఒకే విధానాలు ఉండేలా చూడాలి.. గుడివాడలో ఓ రకంగా, గోవాలో ఓ రకంగా, హైదరాబాద్ లో ఓరకంగా ఉండేలా చేయకూడదని.. హైదరాబాద్ ఫిలింనగర్ లో కూడా గోవాలాంటి కల్చరే ఉందని అక్కడ ఉద్యమం చేసి వాటి ఆపాలని డిమాండ్ చేశారు. చిన్నప్పటి నుంచి సోము వీర్రాజు బీజేపీ అంటే చూపిస్తా అని అంటున్నాడు… అయితే మాకు చూపించాల్సిన పని లేదని, బీజేపీ అంటే చంద్రబాబు నాయుడికి చూపించాలని సవాల్ విసిరారు. గతంలో తెలుగు దేశం పార్టీ వల్లే మా పార్టీ నాశనం అయిందని చెప్పాడని.. కానీ అదే తెలుగు దేశం పార్టీ వ్యక్తులతో కలిసి పనిచేస్తున్నారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news