అర్వింద్‌ బాండ్‌ పేపర్‌ రాశాడు..ఇప్పుడు అనుభవించాల్సిందే : మంత్రి వేముల

-

ఇవాళ నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం ఇస్సపల్లిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ పార్లమెంట్‌ సభ్యులు ధర్మపురి అర్వింద్‌ వాహనం పై టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు, రైతులు రాళ్లతో దాడి చేశారు. అయితే.. సంఘటనపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ బాండ్ పేపర్ మీద రాసి పసుపు బోర్డ్ తెస్తానని గెలిశాడని గుర్తు చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి…ఇప్పడు పాపం అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు.

రైతుల పసుపు పంట చేతికి వచ్చింది… రైతుల ఉగ్రరూపం బయట పడుతోందని పేర్కొన్నారు. ధర్మపురి అర్వింద్‌ చేసింది పాపమని.. చేసిన తప్పుకు అనుభవించాల్సిందేనని ఫైర్‌ అయ్యారు. ప్రొద్దున నుండి ఎంపీ ధర్మపురి అర్వింద్‌.. పోలీసులు రక్షణ లో ఉన్నారని తెలిపారు. రైతులకు మండితే ఇలాగే ఉంటుందన్నారు. త్వరలోనే జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఉంటుందని.. జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు మెడికల్ కాలేజ్ ను ప్రారంభించేందుకు వస్తారని చెప్పారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news