BREAKING : ఏపీ డిప్యూటీ స్పీకర్‌ గా కోలగట్ల వీరభద్ర స్వామి ఏకగ్రీవ ఎన్నిక

-

BREAKING : ఏపీ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక పూర్తి అయింది. ఏపీ డిప్యూటీ స్పీకర్‌ గా కోలగట్ల వీరభద్ర స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలోనే కోలగట్ల వీరభద్ర స్వామి.. డిప్యూటీ స్పీకర్‌ గా కాసేపటి క్రితమే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కోలగట్ల వీరభద్ర స్వామి..వైసీపీ సభ్యులు, టీడీపీ సభ్యులు అభినంధించారు.

కాగా.. ఇదివరకు డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన కోన రఘుపతి తన పదవికి రాజీనామా చేశారు. రెండున్నర సంవత్సరాల తర్వాత కొత్తవారికి అవకాశం ఇవ్వాలంటూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించుకున్న నిబంధనల ప్రకారం, కోన రఘుపతి రాజీనామా చేశారు.

డిప్యూటీ స్పీకర్ గా వైద్య సామాజిక వర్గానికి చెందిన సీనియర్ శాసనసభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి ఎన్నిక అయ్యారు. ఈ పదవి కోసం రెండు రోజుల కిందట ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. 2019 ఎన్నికల్లో విజయనగరం నుంచి కోలగట్ల విజయం సాధించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతిరాజును ఆయన 6 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు.

Read more RELATED
Recommended to you

Latest news