తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం – కోమటిరెడ్డి

-

మిర్యాలగూడ పట్టణంలో టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్,భువనగిరి పార్లమెంట్ స‌భ్యులు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని…ఎవరు ఎన్ని తప్పుడు సర్వేలు రాయించుుకున్నా.. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఆదరణ ఉందని చెప్పారు. ఎన్నికల సమయంలోనే కేసీఆర్ కు గొర్రెలు, బర్రెలు గుర్తొస్తాయి….తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తయిన ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా పేదలకు ఇవ్వలేదని ఫైర్ అయ్యారు.

ధనిక రాష్ట్రమైన తెలంగాణాను కెసిఆర్ అప్పుల ఊబిలోకి నెట్టాడు…. ప్రజాదరణ,పార్టీ అభివృద్ధికి కృషిచేస్తున్నవారికి.. సర్వేల ప్రకారం టికెట్లు కేటాయిస్తామన్నారు.స్థానిక ఎమ్మెల్యే భాస్కరరావు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో కాంట్రాక్టు పనులు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ మా కార్యకర్తలను బెదిరిస్తున్నాడు…ఎమ్మెల్యే భాస్కర్ రావు తన బంధువులైన పోలీస్ అధికారులను తెచ్చుకొని కాంగ్రెస్ నాయకుల పై అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని మండిపడ్డారు. స్టార్ క్యాంపైనర్ గా తెలంగాణ మొత్తం పర్యటించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విధంగా కృషి చేస్తానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news