బ్రహ్మ దేవుడు దిగివచ్చినా.. నిన్ను ఓడిస్తా : జగదీశ్ రెడ్డి కి కోమటిరెడ్డి సవాల్

-

జగదీష్ రెడ్డికి దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో మళ్లీ సూర్యాపేటలో గెలిచి చూపించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. జగదీష్ రెడ్డి గెలిస్తే తాను దేనికైనా రెడీ అన్నారు. బ్రహ్మ దేవుడు దిగి వచ్చిన జగదీష్ రెడ్డిని సూర్యాపేటలో గెలవనియ్యనని.. నీకిదే చివరి ఎన్నిక అని హెచ్చరించారు. మంత్రి జగదీశ్ రెడ్డి మునుగోడులో పిచ్చి పిచ్చి వేశాలు మానుకోవాలని.. టీఆర్ఎస్ నేతలు రాజకీయాలను బ్రష్టుపట్టిస్తున్నారని నిప్పులు చెరిగారు.

అవినీతి డబ్బుతో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారన్నారు. హుజురాబాద్ మాదిరిగా మునుగోడులో కూడా దళిత బంధు పథకం అమలు చేయాలని… మునుగోడు లో ఉన్న 25 వేల కుటుంబాలకు 2 వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మునుగోడు లో దళిత బందు అమలైతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. మళ్ళీ పోటీ చెయ్యనని పేర్కొన్నారు.

మునుగోడు నియోజిక వర్గంలో టీఆరెస్ ఎమ్మెల్యే ను దగ్గరుండి గెలిపిస్తామన్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచిన వ్యక్తులను తీసుకొని వెళ్లి పార్టీ మారడానికి ప్రోత్సాహిస్తున్నారని మండిపడ్డారు. కవిత ను నిజామాబాద్ ఎంపీ గా ప్రజలు ఓడగొట్టినా.. సీఎం కు బుద్ది రాకపోతే ఎలా..? ఉద్యమ కారుడుకు ఉండాల్సి లక్షణాలు ఇవేనా? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news