ఈ నెల 21న అధికారికం గా బీజేపీలో చేరుతున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. జేపీ నడ్డా, కిషన్‌రెడ్డి, తరుణ్‌చుగ్‌లను ఇవాళ కలిశానని వెల్లడించారు రాజగోపాల్‌ రెడ్డి. మునుగోడులో జాయినింగ్‌ సభ ఉండే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఆ రోజే చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.