ఈ నెల 21వ తేదీన బీజేపీ చేరుతున్నా – రాజగోపాల్ రెడ్డి

-

ఈ నెల 21న అధికారికంగా బీజేపీలో చేరుతున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. జేపీ నడ్డా, కిషన్‌రెడ్డి, తరుణ్‌చుగ్‌లను ఇవాళ కలిశానని వెల్లడించారు రాజగోపాల్‌ రెడ్డి. మునుగోడులో జాయినింగ్‌ సభ ఉండే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఆ రోజే చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

తెలంగాణ ఉద్యమంలో లేని వాళ్ళు మమ్మల్ని అవమాన పరిచారని.. మా పై పెట్టిన అధ్యక్షుని బ్రాండ్ ఎటువంటిదో తెలుసు అని తెలుసన్నారు. రేవంత్ తెలంగాణా కోసం ఏం త్యాగం చేసాడని నిలదీశారు. తెలంగాణ కోసం జైలుకు వెళ్లాడా , ఓటుకు నోటు కేసులో వెళ్లాడా ? ని చరిత్ర తెలిసి బాధపడుతున్నామని మండిపడ్డారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. నిన్న మునుగోడు లో నాపై వాడిన భాష దారుణమని.. పిసిసి చీఫ్ రేవంత్ భాష విన్న తర్వాత నేను బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సరిగ్గా మాట్లాడలేని వ్యక్తులు రేవంత్‌ అనుచరులని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news