అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపిన కోటంరెడ్డి

-

అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రాజధాని పరిరక్షణ కోసం 1200 రోజులుగా ఉద్యమిస్తున్న ప్రతి ఒక్కరికి సంఘీభావం తెలియజేస్తున్నానని అన్నారు. “1200 రోజులుగా అమరావతి రాజధాని పరిరక్షణ కోసం వెన్ను చూపక, మాట తప్పక, మడమ చూపక, లాఠీలకు వెరవక దుర్మార్గపు నాయకులకు ఎదురు తిరిగిన ఉద్యమకారులకు ఉద్యమాభి అభినందనలు” అని పేర్కొన్నారు.

అమరావతి పై నారా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సముచితమే అని అన్నారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి ప్రకటన చేస్తే ప్రతిపక్ష నేత మద్దతు పలికారని గుర్తు చేశారు. అమరావతి రాజధాని అంటూ గత ఎన్నికలలో తాము ప్రచారం చేశామని చెప్పారు కోటంరెడ్డి. మూడు రాజధానులు అంటూ చెబుతున్న పార్టీ అమరావతి రాజకీయ రథచక్రాల కింద నలిగిపోతుందన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news