కాంగ్రెస్ గూండాల హత్యాయత్నాన్ని ఖండిస్తున్నా: కేటీఆర్

-

ఎంపీ కొత్త ప్రభాకర్ పై కాంగ్రెస్ గూండాలు చేసిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘నిరాశలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో మన నాయకులను భౌతికంగా నిర్మూలించే ప్రయత్నాలు చేస్తోంది. థర్డ్ గ్రేడ్ క్రిమినల్ను టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించినప్పుడే ఇలాంటివి ఊహించాం. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. దీనిపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నా’ అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎప్పుడూ ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదన్న కేటీఆర్ గాంధీభవన్ లో నాయకత్వం మారిన తర్వాతనే ఇటువంటి పరిణామాలను చూడాల్సి వస్తుందని అన్నారు.

KTR Fires on Congress 6 Guarantees : 'స్కాముల కాంగ్రెస్‌కు స్వాగతం చెబితే..  స్కీములన్నీ ఎత్తేస్తారు', ktr-fires-on-congress -6-guarantees-in-telangana-minster-ktr-comments-on-congres

ఇది అత్యంత దురదృష్టకరమని ఆయన అన్నారు. ప్రజలు ఇలాంటి దాడులను ఎన్నికల సమయంలో తిప్పికొడతారని కేటీఆర్ అన్నారు. దమ్ముంటే ప్రజల్లోకి వెళ్లి కేసీఆర్ ను ఎదుర్కొనాలని, తమ పార్టీ నేతలను అంతమొందించాలంటే తాము కూడా ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్య విధంగా అధికారంలోకి రావాలే తప్ప నాయకులను అంతమొందించి అధికారంలోకి రావాలని చూడటం తగదని కేటీఆర్ హితవు పలికారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news