ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణపై పార్టీ నేతలకు కేటీఆర్‌ కీలక ఆదేశాలు

-

భారత రాష్ట్ర సమితి ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ పైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ గారు ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని.. ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగుతున్న తీరుపైన పార్టీ సీనియర్ నాయకులు మాజీ స్పీకర్ శ్రీ మధుసూదనాచారి గారి ఆధ్వర్యంలో పదిమందితో కూడిన కార్యక్రమాల అమలు కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల కార్యక్రమాలు జరుగుతున్న తీరును పరిశీలిస్తుందన్నారు.

వీరికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేసిన కేటీఆర్..ఈ కమిటీ ద్వారానే కెసిఆర్ గారు పార్టీ కార్యక్రమాల అమలు పర్యవేక్షణ తీరు, వాటికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ను తీసుకుంటారు. ఈ విషయాన్ని గుర్తించి ఈ కమిటీకి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ ఎన్నికల సంవత్సరంలో ప్రతి ఎమ్మెల్యే అత్యంత చురుకైన పార్టీ కార్యకర్తలతో కలిపి ఒక టీం ని ఏర్పాటు చేసుకోవాలి.

 

ఈ టీం ద్వారా అటు పార్టీకి ప్రజలకు నిరంతరం సమాచారం అందించేందుకు, పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకునేందుకు ఉపయోగించుకోవాలి.. ప్రతి నియోజకవర్గంలో సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా పార్టీ మరియు ప్రభుత్వ కార్యక్రమాలను తీసుకుపోయేందుకు సోషల్ మీడియా కమిటీలను మరింత బలోపేతం చేసుకోవాలని కోరారు. ఈ ఆత్మీయ సమ్మేళనాలు మే నెల వరకు కూడా చేసుకోవచ్చని పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మరింత విస్తృతంగా, కూలంకషంగా, అత్యంత పకడ్బందీగా నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించిన కేటీఆర్.. పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ప్రతి ఒక్క భారత రాష్ట్ర సమితి కార్యకర్తను భాగస్వామిని చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకు పోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news