ఇన్నాళ్లు ఓపిక పట్టాం..ఇగ ఇడిసి పెట్టేది లే : మంత్రి కేటీఆర్ వార్నింగ్

-

బిజేపి నేతలకు మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఇన్నాళ్లు ఓపిక పట్టామని..ఇగ ఇడిసి పెట్టేది లే అని మంత్రి కేటీఆర్.. బిజేపిని హెచ్చరించారు. నేతన్నల బతుకులు మారడానికి మేము చేయూత నిచ్చాం..కానీ కేంద్ర సర్కార్ చిన్న భరోసా కూడా ఇస్తలేదని మండిపడ్డారు. ఇక్కడున్న బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలు మాతో కలిసి కొట్లాడితే మంచిదని.. చేనేత ,జౌళి శాఖ డెవలప్మెంట్ విషయంలో కేంద్ర సర్కార్ నిర్లక్ష్య ధోరణి మానుకోవాలని నిప్పులు చెరిగారు.

నేతన్నల బతుకులు మారడానికి తెలంగాణ సర్కార్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. చేనేత అభివృద్ధికి తోడ్పడలని ఏడున్నర ఏండ్లుగా ఎన్నో సార్లు విన్నవించినా కేంద్ర ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలే అని మండిపడ్డారు. మెగా పవర్ లుమ్ క్లస్టర్ మంజూరు చేయమంటే ఇప్పటికి ఉలుకు లేదు పలుకు లేదని.. మరమగ్గాలను ఆధునీకరించడం కోసం సహాయం చేయమంటే పట్టించుకున్న పాపాన పోలేదని ఫైర్ అయ్యారు. జాతీయ చేనేత డెవలప్మెంట్ పథకం కింద 26 బ్లాకులు మంజూరు చేయమంటే 6 చేసి చేతులు దులుపుకొన్నారని.. దాన్యం కొనుగోళ్ల విషయంలో మా ఎంపీలు లోక్ సభలో కొట్లాడిర్రు..ఇక నుండి ఉద్యమమేనని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news