బావా ఓ చిన్న సాయం..హరీష్ రావుకు కేటీఆర్ ఫోన్

-

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తన మంచి మనసును చాటుకున్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మన్నెగూడ లో జరిగిన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. సమ్మేళనం ముగిసిన తర్వాత మునుగోడు నియోజకవర్గం గట్టుపల్ కు చెందిన యశోద (27) తన తండ్రితో కలిసి మంత్రి కేటీఆర్ ను కలిశారు.

తన కుటుంబ పరిస్థితిని వివరించారు. తనకు సహాయం చేయవలసిందిగా అభ్యర్థించారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ యశోద కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులు ఏమి చేస్తారు. నీకు ఏమి కావాలి? గట్టుపల్ లో జిఎన్ఎం పోస్ట్ ఖాళీగా ఉన్నదా? చండూరు వెళ్లి చేస్తావా? పింఛన్ వస్తున్నదా? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి హరీష్ రావుకు ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేశారు. యశోదకు ఉద్యోగం ఇవ్వాలని కోరారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news