మోదీ 8 ఏళ్ల పరిపాలనపై కన్నా లక్ష్మీనారాయణ ప్రశంశలు

-

మోడీ ప్రధానిగా అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తి చేయడం దేశం గర్వించదగ్గ విషయమన్నారు ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ. సంక్షేమ కార్యక్రమాల అమలు తో పాటు దేశ రక్షణ కోసం మోడీ చేసిన కృషి అద్భుతమని కొనియాడారు. మన వైపు చూడాలంటేనే పాకిస్తాన్ భయపడే స్థితికి మోడీ తీసుకు వచ్చారని అన్నారు కన్నా. వైద్య, ఆరోగ్యం లో జనరిక్ మందుల ద్వారా తక్కువ ధరకు నాణ్యమైన పరికరాలు అందుబాటులోకి వచ్చాయన్నారు.

ఆర్టికల్ 370, త్రిబుల్ తలాక్, రామమందిరం లాంటి వివాదాలను ఒక్క చుక్క రక్తం చిందకుండా పరిష్కరించిన యోధుడు మోడీ అంటూ కొనియాడారు. భారతదేశం కోవిడ్ దెబ్బ నుండి ఆర్థికంగా కోలుకోవడానికి ఆత్మ నిర్బర్ ప్యాకేజి ద్వారా ఆదుకున్న ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అన్ని ఇన్సూూషన్ లను కేటాయించడంతో పాటు రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ఆర్థిక ప్యాకేజీలు ఇచ్చారని అన్నారు. సాగరమాల పథకంతో తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని అన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధికి 2500 కోట్లు మోడీ ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version