BREAKING: ప్రముఖ సింగర్, భారత రత్న గ్రహీత లతా మంగేష్కర్ కు కరోనా పాజిటివ్

-

దేశంలో కోవిడ్ పడగవిప్పుతోంది. వరసగా ప్రముఖులు కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ సింగర్, భారతరత్న లతా మంగేష్కర్ కరోనా బారిన పడ్డారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతున్నారు. లత మంగేష్కర్ కు తేలికపాటి లక్షణాలు ఉన్నాయని ఆమె మేనకోడలు రచన తెలిపారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఆమెను ఐసీయూకి తరలించారు.

ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. మహేష్ బాబు, విక్రమ్, సత్యరాజ్, వడివేలు, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, సంగీత దర్శకుడు థమన్, త్రిష, రేణూ దేశాయ్ వంటి వారికి కరోనా సోకింది.

ఇదిలా ఉంటే పలువురు రాజకీయ ప్రముఖులకు కూడా కరోనా సోకుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలకు కరోనా సోకింది. బీహార సీఎం నితీష్ కుమార్, కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మైకి కరోనా సోకింది. ఇదిలా ఉంటే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కూడా కరోనా సోకింది.

Read more RELATED
Recommended to you

Latest news