ఏపీలో పులులు… ఢిల్లీలో పిల్లులు : వైసీపీపై విష్ణువర్ధన్ రెడ్డి హాట్‌ కామెంట్స్

-

ఏపీలో పులులు… ఢిల్లీలో పిల్లులు అంటూ వైసీపీపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి హాట్‌ కామెంట్స్ చేశారు. గుంటూరు లో పోలీస్ స్టేషన్ పై దాడి చేస్తే వైసీపీ ప్రభుత్వం కేసులు ఎత్తి వేసిందని… ఆత్మకూరులో కూడా కేసులు ఎత్తివేస్తామని ఎమ్మెల్యేలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపిసి ని వైసీపీ గా మార్చేస్తారా… వైసీపీ నేతలు అధికారదాహంతో రెచ్చిపోతున్నారని మండిపడ్డారు.

ఆత్మకూరు ఘటనలో స్వేచ్ఛగా విచారణ జరపాలని.. ఐపీఎస్ అధికారులను కూడా అధికారపార్టీ నేతలు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఆత్మకూరు ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని.. డిఎస్పీ పిలిస్తేనే బీజేపీ నేతలు వివాదాస్పద స్ధలం వద్దకు వెళ్లారు..ఆధారాలు మాదగ్గర ఉన్నాయని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, హఫీజ్ ఖాన్, శిల్ప చక్రపాణి రెడ్డి పై కేసు చేయకుంటే చలో ఆత్మకూరు పిలుపునిస్తామని.. వైసీపీ కి అధికారం ఇదే తొలిసారి, చివరిసారి అని సంచలన వ్యాఖ్యలు చేశారు విష్ణు వర్దన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news