చిత్ర పరిశ్రమలో విషాదం..ప్రముఖ సీనియర్ నటుడు బాలయ్య మృతి

-

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం…చోటు చేసుకుంది.

తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు మన్నవ బాలయ్య (94) కన్నుమూశారు. యూసఫ్‌గూడలోని తన నివాసంలో మృతి చెందారు బాలయ్య. 300కి పైగా చిత్రాల్లో నటించిన మన్నవ బాలయ్య.. యమలీల, అన్నమయ్య, పెళ్లిసందడి, మల్లీశ్వరి, శ్రీరామరాజ్యం లాంటి సినిమాల్లో నటించారు మన్నవ బాలయ్య.

ఎత్తుకు పై ఎత్తు సినిమాతో నటుడు అయ్యారు. నిర్మాతగా, దర్శకుడిగా, కథా రచయితగా తన ప్రతిభ చూపారు. గత కొన్ని రోజుల నుంచి… ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. పరిస్థితి విషమించడంతో.. మరణించారు. ఇక బాలయ్య మృతి పట్ల టాలీవుడ్‌ సినీ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news