తెలంగాణలో బిజెపి ఆటలు సాగనివ్వం – చాడ వెంకట్ రెడ్డి

-

తెలంగాణలో బిజెపి ఆటలు సాగనివ్వమని అన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి. సెప్టెంబర్ 4 నుండి 7వరకు శంషాబాద్ లో సీపీఐ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. దేశం పూర్తిగా అదానీ, అంబానీ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోతుందన్నారు చాడా. అదానీ ఎక్కడివాడు? లక్షల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు? అంటూ ప్రశ్నించారు. మోదీ అండదండలతో అదానీ, అంబానీలు అడ్డగోలుగా సంపాదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన చిన్నప్పుడు విన్న టాటా, బిర్లాలు కనుమరుగైపోయారని.. ఇప్పుడు ఆదానీ – అంబానీ చెప్పు చేతుల్లోకి దేశం వెళ్లిపోయిందని అన్నారు. దేశంలో మతోన్మాదం పెరిగిపోతోందన్నారు. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగనివ్వమన్నారు చాడా. బీజేపీ తెలంగాణకి చేసిందేమీ లేదని.. బీజేపీ నాయకులు తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. విభజన హామీల్లో ఒక్కటి కూడా బీజేపీ అమలుచేయలేదన్నారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోతే ప్రత్యక్ష పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news