కళ్ళు చెదిరే రేట్లకు “లైగర్” శాటిలైట్, డిజిటల్ రైట్స్

-

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా రూపొందుతోంది. పూరి జగన్నాథ్, నటి చార్మి, కరణ్ జోహార్ కలిసి పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో విజయ్‌ దేవర కొండ కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు.అయితే ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర బృందం.

ఈ ట్రైలర్ లో విజయ్ దేవరకొండ పవర్ ఫుల్ గా కనిపించాడు. విజయ్ దేవరకొండ తో పాటు రమ్యకృష్ణ యాక్టింగ్ కూడా అదిరిపోయింది. టీజర్ ను మించిపోయి ఈ ట్రైలర్ ఉంది. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే సినిమాపై అందరికీ అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కాగా.. ఈ సినిమా ఆగస్టు 25 వ తేదీన విడుదల కానుంది.అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.

ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు కళ్లు చెదిరే ధరకు అమ్ముడు పోయాయట. ప్రముఖ దిగ్గజ సంస్థ స్టార్ గ్రూప్ రూ. 55 కోట్లకు లైగర్ మూవీ డిజిటల్, శాటిలైట్ హక్కులను కొనుగోలు చేసిందట. ఓ యంగ్ హీరోకు ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version