వారికి మాత్రమే రుణమాఫీ..క్లారిటీ ఇచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

-

ప్రస్తుతం రాష్ట్రంలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందుకు కారణం రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం రిలీజ్ చేసిన మార్గదర్శకాల్లో కొన్ని నియమ నిబంధనలు పెట్టడమే.రేషన్ కార్డు రుణమాఫీకి ప్రామాణికమని ప్రభుత్వం కండిషన్ పెట్టింది . దీంతో రేషన్ కార్డులు లేని రైతులు తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం రేషన్ కార్డుల ఆధారంగా కాకుండా పాస్ బుక్‌ల ప్రామాణికంగా లోన్లు మాఫీ చేసిందని.. ఇప్పుడు కూడా అదే విధానంలో లోన్లు మాఫీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో రుణమాఫీ ప్రాసెస్‌పై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పష్టత ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీ ప్రక్రియ పాత పద్దతిలోనే జరుగుతోందని తెలిపారు.

పాస్ బుక్‌ల ఆధారంగానే రుణమాఫీ చేస్తామని.. తెలుపు రేషన్ కార్డు కేవలం లబ్ధిదారుడి కుటుంబ నిర్ధారణ కోసమేనని ఆయన స్పష్టం చేశారు. గోల్డ్ లోన్ పెట్టిన రైతులకు రుణమాఫీ వర్తించదని.. కేవలం పాస్ బుక్ ఆధారంగా తీసుకున్నవారికే రుణమాఫీ వర్తిస్తుందని తెలిపారు. మొత్తం 40 లక్షల మంది రైతులు అగ్రికల్చర్ లోన్లు పొందారని అందులో 11.5 లక్షల మంది రూ.లక్ష లోపు అప్పు తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీ నుండి రుణమాఫీ ప్రాసెస్ ప్రారంభమవుతుంద ని తెలిపారు. 18వ తేదీన ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా రూ.లక్ష వరుకు ఉన్న పంట లోన్లను మాఫీ చేస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version