బ్రేకింగ్: ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ సడలింపు..

-

కరోనా కారణంగా అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ విధించుకున్నాయి. కరోనా నుండి కాపాడుకోవడానికి అదొక్కటే మార్గం అనుకుని దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ వైపే ముగ్గుచూపాయి. ఐతే ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గింది. కేసులు తగ్గాయి. మరనాలు తగ్గాయి. ఈ కారణంగా లాక్డౌన్ సడలింపులు పెరిగాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాక్డౌన్ సడలింపులు ఇచ్చింది. ఇప్పటివరకు ఉదయం 6గంటల నుండి 2గంటల వరకు ఉన్న సడలింపులను సాయంత్రం 6గంటల వరకు చేసింది.

అంటే తెలంగాణ మాదిరి నైట్ కర్ఫ్యూ మాత్రమే ఉండనుంది. ఈ సడలింపులు ఈ నెల 20తర్వాత నుండి అమల్లోకి రానున్నాయి. ఐతే తూర్పు గోదావరి జిల్లా మినహాయించి ఈ సడలింపులు ఉండనున్నాయి. ఈ జిల్లాలో కరోనా ఉధృతి ఇంకా తగ్గలేనందున మధ్యాహ్నాం 2గంటల వరకు సడలింపులు ఉంటున్నాయి. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం ఆరు గంటల వరకు లాక్డౌన్ సడలింపులు ఉన్నాయన్నమాట. మరి పూర్తి సడలింపులు ఎప్పుడు వస్తాయో!

Read more RELATED
Recommended to you

Latest news