చేతగాని పాలకుడు, చెత్త ప్రభుత్వం : జగన్ పై లోకేష్ సంచలన ట్వీట్

-

ఆస్పత్రిలో చనిపోయిన తన కొడుకు భుజాలపై తీసుకుపోతున్న ఘటనపై నారా లోకేష్ రీయాక్ట్ అయ్యారు. చేతగాని పాలకుడు, చెత్త ప్రభుత్వం అని ఫైర్ అయ్యారు. మొన్న ప్రభుత్వ ఆసుపత్రిలో యువతి పై సామూహిక అత్యాచారం జరిగిందని… నేడు మరో ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ప్రైవేట్ అంబులెన్స్ దందా కారణంగా అమానవీయ ఘటన అని మండిపడ్డారు.

అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? చేతగాని పాలకుడు, చెత్త పాలన కారణంగా అనారోగ్యంతో చనిపోయిన కొడుకు మృతదేహాన్ని..ప్రైవేట్ అంబులెన్స్ ల ధరలు తట్టుకోలేక బైక్ పైనే రాజంపేట జిల్లాలోని చిట్వేలుకు 90 కి.మీ. మేర బాలుడి మృతదేహాన్ని తరలించారు ఆ తండ్రి అంటూ ట్వీట్ చేశారు లోకేష్.

గత తెలుగుదేశం ప్రభుత్వం పార్థివ దేహాన్ని ఉచితంగా తరలించే మహాప్రస్థానం రవాణా వాహనాలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. వైసిపి ప్రభుత్వం మహాప్రస్థానం వాహనాలను నిర్వీర్యం చెయ్యడం కారణంగానే ప్రైవేట్ అంబులెన్స్ దందా పెరిగి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని… ఇప్పటికైనా సీఎం గారు నిద్రలేచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news