జగన్, వైఎస్ భారతి దావోస్ టూర్ పై లోకేష్ సంచలన ట్వీట్ !

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.. నిన్న దావోస్‌ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఏపీ మంత్రులు, ఆయన భార్య మణి వైఎస్‌ భారతి తో కలిసి.. దావోస్‌ పర్యటనకు వెళ్లారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. అయితే.. ఈ దావోస్‌ పర్యటన పై నారా లోకేష్‌ సెటైర్‌ వేశారు. వైఎస్‌ జగన్‌, వైఎస్‌ భారతీ ఫోటోను షేర్‌ చేస్తూ.. మండిపడ్డారు నారా లోకేష్‌.

మా నాన్నని ద్వేషించేవారు, విమర్శించేవారు సైతం ఆఖరికి ఆయన మార్గంలో నడవాల్సిందేని తెలిపారు. సంక్షేమం నుండి ఐటి వరకూ.. అమరావతి నుండి విదేశాలు వెళ్లి పెట్టుబడులు ఆకర్షించడం వరకూ చంద్రన్న మార్గమే రాజమార్గమని చురకలు అంటించారు నారా లోకేష్‌. దావోస్ ఎందుకు డబ్బులు దండగ అన్న జగన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా స్పెషల్ ఫ్లైట్ లో దావోస్ పర్యటన కు వెళ్లాల్సి వచ్చింది. బహుశా దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనేమో అంటూ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి చురకలు అంటించారు నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news