ఆ యేసు ప్రభువు బాటలో అందరూ నడవాలి – నారా లోకేష్ సంచలనం

-

ఆ యేసు ప్రభువు బాటలో అందరూ నడవాలని టీడీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ కీలక నేత నారా లోకేష్ సంచలన ట్వీట్‌ చేశారు. నేడు గుడ్‌ ఫ్రైడ్‌. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్‌…క్రైస్తవులకు తన సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. శిలువపై ఉన్న చివరి క్షణాల్లో కూడా శత్రువును క్షమించి తన ప్రేమ తత్వాన్ని చాటిన ఏసుక్రీస్తు జీవితం ఒక అద్భుతమన్నారు లోకేష్‌.

మనుషుల మధ్య సామరస్యం ఉండాలని, సాటివారికి నిస్వార్థంతో సేవ చేయాలనే క్రీస్తు బోధన మనందరికీ ఆచరణీయమని పేర్కొన్నారు. GoodFriday సందర్భంగా ఏసు చూపిన మార్గంలో నడిచేందుకు సంకల్పిద్దామని పిలుపు నిచ్చారు నారా లోకేష్‌.

ఇక మరో ట్వీట్‌ లో సీఎం జగన్‌ పై ఫైర్‌ అయ్యారు. యధా సీఎం తధా అధికారులు.. ప్రజల్ని మోసం చెయ్యడంలో నిపుణుడైన జగన్ మోసపు రెడ్డిని ఆర్టీసీ అధికారులు ఆదర్శంగా తీసుకున్నారని.. మొన్నటి ప్రకటనకు నేటి బాదుడుకి సంబంధం లేదని ఆగ్రహించారు. పెంపు స్వల్పమేనని ఛార్జీలు భారీగా పెంచడం దారుణం. కిలోమీటర్ల బట్టి ఛార్జీలు పెంచడం వలన ప్రజల పై పెను భారం పడిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news