బీజేపీ, ఎంఐఎం పొత్తుపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

-

మహారాష్ట్రలో రాజకీయ ఎంఐఎం కేంద్రంగా సాగుతోంది. ఎంఐఎంతో పొత్తు గురించి శివసేన, బీజేపీ, ఎంఐఎం నాయకులు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా రాజ్యసభ ఎంపీ, శివసేన కీలక నేత సంజయ్ రౌత్ బీజేపీ, ఎంఐఎంల పొత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఇంతియాజ్ జలీల్ ఏఐఎంఐఎం ఎంపీ ఆయనను నేను కలుస్తూ ఉంటానని.. అంత మాత్రాన పొత్తు పెట్టుకున్నట్లు కాదని.. ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవడాన్ని మేం ఊహించుకోలేమని… ఎంఐఎం, బీజేపీ మధ్య రహస్య పొత్తు ఉందని.. మీరు యూపీ ఎన్నికల్లో చూసే ఉంటారని వ్యాఖ్యానించారు సంజయ్ రౌత్. శివసేన, ఎంఐఎం పొత్తు అనేది మాకు పెద్ద విషయం కాదని… ప్రధాని మోదీ, మేం చేస్తున్న పనిని చూసి ప్రజలు ఓటు వేశారని.. ఈ రాజకీయ పార్టీలన్నీ ఒకటే అని, అన్నీ కలిసి వచ్చినా.. మాకు ఎలాంటి నష్టం లేదని బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. 

మరోవైపు ఎంఐఎం నాయకుడు, ఎంపీ ఇంతియాజ్ జలీల్ కూడా ఈ పొత్తుల వ్యవహారంపై స్పందించారు. బీజేపీ గెలుపుకు ఎంఐంఎం కారణం అని… మేం బీజేపీకి ‘ బి’ టీమ్ అంటూ కొంత మంది విమర్శిస్తారని.. అయితే కాంగ్రెస్ పార్టీని మాతో పెట్టుకోమని ఆఫర్ ఇచ్చాం అని.. అయితే మహారాష్ట్రలో శివసేనతో కలిసి ఉందండంతో పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్ అంగీకరించదని ఇంతియాజ్ జలీల్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version