సౌత్ సినీ ఇండస్ట్రీలోకి ధోనీ ఎంట్రీ.. ఆ సూపర్ స్టార్లతో సినిమాలు

-

ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ త్వరలోనే సౌత్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. నిజమే మీరు విన్నది. కానీ.. శిఖర్ ధావన్ , హర్భజన్ సింగ్ లలా హీరోలా కాదు సౌత్ సూపర్ స్టార్స్ తో సినిమాలు తీసేందుకు ధోనీ దక్షిణాదిన ఎంట్రీ ఇస్తున్నాడు. ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ఇప్పటికే ‘రోర్‌ ఆఫ్‌ లయన్‌’, ‘బ్లేజ్‌ టు గ్లోరీ’, ‘ద హిడెన్‌ హిందూ’ అనే మూడు షార్ట్ ఫిల్మ్స్ తీశారు. వీటికి  ధోనీ, ఆయన సతీమణి సాక్షి నిర్మాణ బాధ్యతలు వహించారు.

ఇకపై భారీ స్థాయిలో సౌత్‌ స్టార్స్‌తో సినిమాలు చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు ధోనీ. ఇందులో భాగంగా తమిళ హీరో విజయ్‌తో ధోనీ ఓ చిత్రానికి అంగీకారం కుదుర్చుకున్నట్లు సమాచారం. అలాగే కన్నడలోనూ పేరున్న హీరోలతో సినిమా చేయబోతున్నాడు. తెలుగులో ధోనీ నిర్మాణంలో మహేశ్ బాబు నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రకటన రావాల్సి ఉంది.

మహేశ్ బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా ఇప్పటికే ఓ చిన్న షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఇందులో భాగంగా మహేష్‌పై కొన్ని యాక్షన్‌ సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఈ చిత్రానికి ‘పార్థు’ అనే పేరు పరిశీలిస్తున్నట్లు గతంలో ప్రచారం వినిపించింది. అయితే ఇప్పుడీ సినిమా కోసం మరో కొత్త టైటిల్‌ తెరపైకి వచ్చింది. త్రివిక్రమ్‌ సినిమా పేర్లు ఎక్కువగా ‘అ’ అక్షరంతో మొదలవుతుంటాయి. ఇప్పుడీ ఆనవాయితీకి తగ్గట్లుగానే మహేష్‌ చిత్రానికి ‘అయోధ్యలో అర్జునుడు’ అనే పేరు ఖరారు చేయనున్నారని వార్తలు ఊపందుకున్నాయి.

ఇదే కాకుండా మహేశ్ త్వరలో దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమాలోనూ నటించనున్నారు. మరి ధోనీతో మూవీ ఎప్పుడు సెట్ పైకి వెళ్తుందో చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news