పోకిరీ రోజులు గుర్తొచ్చాయి : మహేష్ బాబు

-

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా.. గీత గోవిందం ఫేమ్ పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సర్కారు వారి పాట. అయితే ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం.. యూసఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్బంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. ఒక్కడు సినిమా చూసి దర్శకుడిని అవుదామని ఇండస్ట్రీకి వచ్చానని పరశురామ్‌ చెప్పారు. ఇవాళ నాకు, నా అభిమానులకు ఫేవరేట్‌ డైరెక్టర్‌ అయ్యాడు.

ఈ చిత్రంలో ఆయన నన్ను కొత్తగా చూపించారు. నా ఫేవరేట్‌ క్యారెక్టర్‌ ఇది. మ్యానరిజమ్స్‌, బాడీ లాంగ్వేజ్‌ ఇలా ప్రతిదీ వెరైటీగా డిజైన్‌ చేశారు. కొన్ని సన్నివేశాల్లో నటిస్తుంటే పోకిరీ రోజులు గుర్తొచ్చాయి. ట్రైలర్‌ చూశాక మీరంతా ఎంత ఎంజాయ్‌ చేశారో, నేనూ అంతే ఆస్వాదించాను. చాలా హైలైట్స్‌ ఉంటాయి. హీరో హీరోయిన్స్‌ లవ్‌ ట్రాక్‌ అందులో ఒకటి. ఈ సీన్స్‌ కోసమే రేపు మళ్లీ మళ్లీ సినిమా చూస్తారు. కీర్తి సురేష్‌ పాత్ర సరదాగా సాగుతుందని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news