ఇవాళ ఢిల్లీలో విపక్ష పార్టీల సమావేశం..రాష్ట్రపతి అభ్యర్థిపై ప్రకటన

-

ఇవాళ ఢిల్లీలో విపక్ష పార్టీల సమావేశం జరుగనుంది. విపక్ష పార్టీలను, ముఖ్యమంత్రులను ఆహ్వానించిన వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున మల్లికార్జున ఖర్గే, సుర్జీవాలే, జైరాం రమేష్ సమావేశానికి హాజరుకానున్నారు. కాంగ్రెస్ పార్టీ తో వేదిక పంచుకోబోమని ఇప్పటికే టీఆరెస్ పార్టీ స్పష్టం చేసింది.

బిజెపి, కాంగ్రెస్ లకు సమదూరం పాటించాలని టీఆరెస్ పార్టీ భావిస్తోంది. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఆహ్వానించిన వారిలో ఎవరొస్తారో, డుమ్మా కొట్టేదెవరో అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే శరద్ పవార్ తో భేటీ అయిన మమత బెనర్జీ.. ఉమ్మడి అభ్యర్థి ప్రతిపాదనకు అంగీకరించాకే, అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news