చేతబడి చేయమన్నాడు.. కత్తితో పొడిచి చంపేశాడు..!

-

తాను చెప్పిన పని చేయనందుకు ఒక వ్యక్తిని మరో వ్యక్తి అతి దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు.. ఈ ఘోరమైన ఘటన నరసరావుపేట లో చోటుచేసుకుంది. హత్యకు కారణమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

police shook at visuals in kadapa gurralagadda incident
police shook at visuals in kadapa gurralagadda incident

నరసరావుపేటలోని లలితా నగర్ కాలనీ నివాసముంటున్న బలుసుపాటి వీరాంజనేయులు(32) అనే వ్యక్తి గతంలో చేతబడులు చేస్తువుండేవాడు. అదే కాలనీకి చెందిన మందం వేణు సాయి అనే వ్యక్తి చేతబడి చేయాలని కోరగా వీరాంజనేయులు చేయనని నిరాకరించడం తో ఇరువురి మధ్య గొడవ జరిగింది. మాట మాట పెరిగి మర్డర్ కు దారి తీసిందని స్థానికులు, పోలీసులు ద్వారా వచ్చిన ప్రాథమిక సమాచారం. అయితే మూడో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వేణు సాయి పారిపోతుండగా హైవే రోడ్ మీద అదుపులోకి తీసుకున్నారు. మరొక వ్యక్తి పరారీ లో ఉన్నట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news