భార్య తిరిగి రానందని అత్తింటికి నిప్పంటించిన భర్త.. ఐదుగురు సజీవదహనం

-

చండీగఢ్ లోని జలంధర్ లో దారుణం చోటుచేసుకుంది. భార్య పుట్టింటి నుంచి రానందని కోపంతో అత్తింటికి నిప్పంటించాడు భర్త. ఈ ఘటనలో భార్యతో పాటు ఐదుగురు సజీవదహనమయ్యారు. అసలేం జరిగిందంటే..?

పుట్టింటికి వెళ్లిన భార్య తన వద్దకు వచ్చేందుకు నిరాకరించడంతో 30 ఏళ్ల వ్యక్తి కుల్దీప్‌ సింగ్‌ తీవ్ర కలత చెందాడు. పరమ్‌జిత్‌ కౌర్ తన ఇద్దరు పిల్లలతో గత ఐదారు నెలలుగా తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నారు. లుధియానాలోని ఖుర్షిద్‌పూర్‌ గ్రామానికి చెందిన  కుల్దీప్‌సింగ్‌‌ తమ ఇంటికి తిరిగి వచ్చేయాలని కోరాడు. కానీ తనను, పిల్లల్ని అతడు కొడుతున్నాడని ఆరోపిస్తూ  తిరిగి వెళ్లేందుకు నిరాకరించారని పోలీసులు వెల్లడించారు. భార్యతో పాటు నలుగురు కుటుంబ సభ్యులు నిద్రపోతున్న సమయంలో తన మనుషులతో వెళ్లిన కుల్దీప్‌ పెట్రోల్‌ పోసి ఇంటికి నిప్పు పెట్టడంతో వారంతా సజీవ దహనమయ్యారని జలంధర్‌ (రూరల్‌) ఎస్పీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news