జగన్ తో చిరంజీవి భేటీ : మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

-

గత 15 రోజుల కిందట మెగాస్టార్‌ చిరంజీవి, సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టాలీవుడు చిత్ర పరిశ్రమ సమస్యలు, సినిమా టికెట్ల ధరలపై చర్చించారు. అయితే.. చిరు-జగన్‌ ల సమావేశంపై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, జగన్ కలయిక పర్సనల్ మీటింగ్ అని… దానిని అసోసియేషన్ మీటింగ్ గా భావించకూడదన్నారు. తమకు చిరంజీవి, వెంకీ, నాగార్జున, బాలయ్య అందరూ పెద్దలేనని చెప్పారు.

అందరం కలిసి.. నిర్ణయాలు తీసుకుంటామన్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సినిమా టికెట్లపై నిర్ణయం తీసుకుంటుంది… వ్యక్తిగతంగా నా నిర్ణయంతో పని లేదు.. ఎవరూ నా అభిప్రాయం అడగడం లేదని స్పష్టం చేశారు. సినిమా టిక్కెట్స్ పై వైఎస్సార్ హయాంలోనే ఓ జీవో వచ్చింది… దానిపై కూడా చర్చ జరగాలన్నారు.సినిమా టిక్కెట్ల ధరలు తెలంగాణలో పెంచారు… ఏపీలో తగ్గించారు.. కానీ రెండు చోట్లా కోర్టుకు వెళ్లారన్నారు.

దీనిపై సినీ పరిశ్రమ ఏకత్రాటి పైకి రావాలని పిలుపునిచ్చారు. టికెట్ల ధరల వివాదంపై తెలుగు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం మేరకు ముందుకు వెళదాము… ఒకరిద్దరు మాట్లాడి దీనిపై వివాదం చేయడం సరికాదని పేర్కొన్నారు. రెండు ప్రభుత్వాలుతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తాము… నేను విడిగా మాట్లాడి సమస్య పక్కదారి పట్టించలేనన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news