నాన్న ను నేనే ఆపుతున్నా : మంచు విష్ణు

-

మా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇండస్ట్రీలో ఎన్నికల వేడి మరింత పెరుగుతోంది. అధ్యక్ష బరిలోకి దిగుతున్న ప్రకాష్ రాజ్ మంచు విష్ణు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి మా ఎన్నికల వేళ విమర్శలు కురిపించుకోడం కనిపిస్తోంది. ఇక తాజాగా మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మా’లో ఇలా జరుగుతున్నందుకు మా నాన్న ఎంతో బాధపడుతున్నారని విష్ణు వ్యాఖ్యానించారు. ఆయనే వచ్చి మాట్లాడాలనుకున్నా.. నేనే ఆపుతున్నా..అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.వాళ్ల ఆరోపణలకు మేం సమాధానాలు ఇవ్వకపోతే అదే నిజం అనుకుంటారని.. అందుకే వాళ్ల ఆరోపణలకు సమాధానం ఇస్తున్నాం అని విష్ణు చెప్పారు. ఇండస్ట్రీ పల్స్‌ వాళ్లకు అర్థమైనందుకే గందరగోళం సృష్టిస్తున్నారని ప్రకాష్ రాజ్ ప్యానల్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రకాష్‌రాజ్‌ కోర్టుకు వెళ్లి ఎన్నికలు ఆపినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు. ఇది ఇద్దరి మధ్య పోరు కాదని ‘మా’ కు సంబంధించిన పోరు అని మంచు విష్ణు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news