భాజపాలో చేరితే కేసులన్నీ ఎత్తివేస్తారట : సిసోదియా

-

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన దిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలకు సంబంధించి రోజుకో ఆసక్తికర విషయం బయటపడుతోంది. తాజాగా దీనిపై దిల్లీ ఉపముఖ్యమంత్రి ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇప్పుడు అది దేశ రాజకీయాల్లో కాక రేపుతోంది.

భాజపాలో చేరితే కేసులన్నీ ఎత్తివేస్తామంటూ తనను సంప్రదించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోదియా. “మహారాణా ప్రతాప్​, రాజ్​పుత్​ వారసుడిని. తల నరక్కుంటాను. కానీ మీలాంటి కుట్రదారులు, అవినీతిపరుల ముందు ఎన్నటికీ తల వంచను” అని సమాధానం ఇచ్చానని సిసోదియా చెప్పారు.

“భాజపా నుంచి నాకు ఓ సందేశం అందింది. ఆప్​ను విడిచిపెట్టి భాజపాలో చేరితే.. సీబీఐ, ఈడీ పెట్టిన కేసులన్నీ మూసేస్తామన్నారు. దానికి సమాధానం ఇస్తూ.. నేను మహారాణా ప్రతాప్​, రాజ్​పుత్​ వారసుడిని. తల నరక్కుంటాను. కానీ మీలాంటి కుట్రదారులు, అవినీతిపరుల ముందు ఎన్నటికీ తల వంచను. నాపైన పెట్టిన కేసులన్నీ అబద్ధం. మీరు చేయాలనుకున్నది చేసుకోండి”-మనీశ్​ సిసోదియా, దిల్లీ ఉపముఖ్యమంత్రి

 

 

Read more RELATED
Recommended to you

Latest news