మంత్రి రోజా: పవన్ కళ్యాణ్ వాలంటీర్ల కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పాలి !

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తాజాగా మంత్రి రోజా తనదైన శైలిలో రెచ్చిపోయి మాట్లాడారు. గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలపై వివిధ రకాలుగా వైసీపీ నేతలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రోజా మాట్లాడుతూ… చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ను వాలంటీర్లపై వదిలి వారిని ఇబ్బంది పెడుతున్నారని ఫైర్ అయ్యారు. పవన్ వాలంటీర్ల గురించి చేసిన వ్యాఖ్యల పట్ల సిగ్గుపడాలని రోజా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలకు పూర్తి బాధ్యత వహిస్తూ వాలంటీర్ల కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలని మంత్రి రోజా డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో అద్భుతమైన పాలనలో సంతోషంగా ఉన్న ప్రజలను చూసి పవన్ కళ్యాణ్ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. కొంచెం అయినా మహిళల గురించి మాట్లాడే ముందు.. ఆలోచించాలని దుయ్యబట్టారు.

ఈ వ్యాఖ్యలను బహిరంగసభలో వెనక్కు తీసుకుని క్షమాపణలు చెప్పాలని ఆమె చెప్పింది. కాగా మంత్రి రోజా చేసిన ఈ కామెంట్ ల పట్ల పవన్ లేదా జనసేన నేతలు ఎవరైనా స్పందిస్తారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news