హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పలు ఆంక్షలు

-

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పలు ఆంక్షలు విధించారు. 31వ తేదీ రాత్రి 10 గంటల నుండి ఒకటో తేదీ తెల్లవారుజాము 5 గంటల వరకు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు మూసివేయనున్నారు. ఓ ఆర్ఆర్పై లైట్ మోటార్ వెహికల్ కు అనుమతి లేదు. ఎయిర్పోర్టుకు వెళ్లే వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. కమిషనరేట్ పరిధిలోని 10 ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు.

రాత్రి 11 గంటల నుండి మరుసటి రోజు 5 గంటల వరకు పివి ఎక్స్ప్రెస్ వే క్లోజ్ చేయనున్నారు. బార్లు, పబ్బులు, క్లబ్ లో యజమానులు తమ కస్టమర్లు డ్రంకన్ డ్రైవ్ చేయకుండా చూసుకోవాలి.. లేని పక్షంలో యజమానుల పైన కేసులు నమోదు చేస్తారు. 31వ తేదీ రాత్రి యధావిధిగా డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగుతుంది. మైనర్, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు వాహనాల నడిపితే కోర్టులో హాజరు పరుచనున్నారు పోలీసులు. వాహనాలలో భారీ శబ్దాలతో డీజేలు, సౌండ్లు పెట్టుకుంటే వారిపై కేసులు చేస్తారు. క్యాబ్ డ్రైవర్లు యూనిఫామ్ ధరించాలి, అవసరమైన డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news