విషాదం : గుజరాత్‌లో ఘోర రోడ్డ ప్రమాదం. 10 మంది మృతి

-

గుజరాత్‌లోని నవసారి జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మరణించారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారు జామున నవ్‌సారి జిల్లా వెస్మా గ్రామ సమీపంలో బస్సు కారు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. దాదాపు 32 మంది గాయపడ్డారు. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో 17 మందిని వల్సాద్‌లోని ఆసుపత్రికి..మరో 14 మందిని నవ్‌సారిలోని ఆసుపత్రికి.. మరొక క్షతగాత్రుడిని చికిత్స కోసం సూరత్‌ ఆసుపత్రికి తరలించినట్లు అదనపు జిల్లా కలెక్టర్ కేతన్ జోషి తెలిపారు.

Black Spot In Delhi:ब्लैक स्पॉट होते हैं गंभीर हादसों के लिए जिम्मेदार,  जानें दिल्ली में कहां हैं ऐसी जगह - Black Spots Are Responsible For Road  Accidents Know Ten Black Spots Or

ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరగడంతో బస్సు డ్రైవర్‌కు గుండెపోటు వచ్చిందని.. అతడు కూడా అక్కడికక్కడే చనిపోయాడని చెప్పారు. బస్సులో ఉన్నవారంతా సూరత్‌లో జరిగిన ప్రముఖ్‌ స్వామి మహరాజ్‌ మహోత్సవ్‌కు హాజరై తిరిగి సొంతూళ్లకు వెళ్తున్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news