ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి

-

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడలో మరోసారి కాల్పల ఘటన చోటుచేసుకుంది. మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు ఒక్కసారిగా నక్సల్స్ ఎదురు పడటంతో ఇరు వర్గాల మధ్య భీకరకాల్పులు చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ కాల్పుల్లో 10 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించిన ప్రాంతాల్లో ముందస్తు సమాచారంతోనే మావోయిస్టులు కూడా ఎదురుదాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన పురంగెల్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు పోలీసు అధికారులు ధృవీకరించారు. సుమారు రెండు గంటల పాటు కాల్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తుండగా.. మావోలకు గట్టి ఎదురుదెబ్బ తగలడంతో మరికొందరు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version