ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీ

-

ఏపీలో పలువురు ఐఏఎస్సుల బదిలీలు అయ్యారు. ఇరిగేషన్ స్పెషల్ సీఎస్సుగా కెఎస్ జవహర్ రెడ్డి బదిలీ కాగా.. టీటీడీ ఈఓగా జవహర్ రెడ్డికి అదనపు భాద్యతలు అప్పగించింది సర్కార్. ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా శ్యామల రావు బదిలీ కాగా… క్రీడలు, యువజన సర్వీసుల శాఖ స్పెషల్ సీఎస్సుగా జి. సాయి ప్రసాద్ ను బదిలీ చేసింది. ఆర్థికశాఖ కార్యదర్శి(కమర్షియల్ టాక్స్)గా ముఖేష్ కుమార్ మీనా బదిలీ కాగా… పాఠశాల విద్యా శాఖ కమిషనరుగా ఎస్.సురేష్ కుమార్ బదిలీ అయ్యారు.

అలాగే గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టరుగా వి.చిన వీరభద్రుడు బదిలీ కాగా… సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీగా పి. రంజిత్ బాషా బదిలీ అయ్యారు. చేనేత డైరెక్టరుగా సి.నాగ రాణి బదిలీ కాగా… బీసీ సంక్షేమశాఖ డైరెక్టరుగా పి. అర్జున్ రావు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎస్ సమీర్ శర్మ. ప్రభుత్వం ఉత్తర్వులను అధికారులు తుచా తప్పకుండా పాటించాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news