ఏపీ కౌంటింగ్ లో బోణి కొట్టిన వైసీపీ

-

ఆంధ్ర ప్ర‌దశ్ రాష్ట్రంలో ఇటీవ‌ల జ‌రిగ‌న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ఈ రోజు కౌంటింగ్ నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ కౌంటింగ్ లో అధికార పార్టీ అయిన వైఎస్ ఆర్ సీపీ బోణీ కొట్టింది. ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప లోని క‌మాల‌పూరం మున్సిపాలిటీ నుంచి ఈ ఫ‌లితం వెల్ల‌డైంది. క‌మాలపురంలో ని 11 వ వార్డు లో వైసీపీ అభ్య‌ర్థి స‌లీల 250 ఓట్ల తేడాతో విజ‌యం సాధించింది. అలాగే అధికార వైసీపీ ప‌లు మున్సిపాల్టీ ల‌లో కొన్ని వార్డు ల‌లో అధిక్యం లో ఉంది. కుప్పంలో ఒక వార్డు లో వైసీపీ అధిక్యం లో ఉంది.

అలాగే నెల్లూరు కార్పోరేష‌న్ లో కూడా 8 స్థానాల‌లో వైసీపీ అధిక్యం లో ఉంది. అలాగే దాచేప‌ల్లి, ద‌ర్శి ల‌లో కూడా ఒక్కో వార్డు ల‌లో అధికార వైసీపీ పార్టీ లీడ్ లో కొన‌సాగుతుంది. వీటి తో పాటు గుర‌జాల లో 6 వార్డుల‌లో వైసీపీ అధిక్యం లో ఉంది. అయితే ఈ ఎన్నిక‌ల‌లో అధికార వైసీపీ పార్టీ దాదాపు అన్ని మున్సిపాల్టీ ల‌ను ద‌క్కించు కోవ‌డం ఖాయం గా క‌నిపిస్తుంది. టీడీపీ సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో కూడా వైసీపీ పాగ వేసే అవ‌కాశం కూడా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news