పవన్ క్లారిటీ : మెహర్ రమేశ్ డైరక్షన్ లో చిరు..!

-

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్ లో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ సమర్పిస్తున్న ఈ సినిమాను మైత్రి ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నది. అలాగే ఈ చిత్రంలో రామ్ చరణ్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఇటీవ‌లే చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆగ‌స్టు 22న రిలీజ్ అయిన ఆచార్య పోస్ట‌ర్‌ కు మంచి స్పందన వచ్చింది. అయితే ప్రస్తుతం ఆచార్య షూటింగు దశలో ఉంది. ఈ నేపధ్యంలో చిరంజీవి తర్వాత సినిమాపై అందరి దృష్టి పడింది.

చిరు తన తర్వాతి సినిమా ఎవరితో చేయనున్నారు అనే డౌట్ అందరికి ఉంది. అయితే ఇప్పుడు తాజాగా.. చిరంజీవి నెక్స్ట్ సినిమాపై క్లారిటీ వచ్చేసింది. పవన్ బర్త్‌ డే సందర్భంగా మెహర్ రమేశ్ ట్విట్టర్ ద్వారా ఆయనకి విషెస్ తెలిపారు. దీనిపై పవన్ స్పందిస్తూ, చిరంజీవితో మీరు తీయబోయే సినిమాకు ఆల్ ది బెస్ట్ అంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు. దీంతో చిరు, రమేశ్ కాంబినేషన్లో సినిమా రాబోతోందనే విషయం బయటపడింది.

Read more RELATED
Recommended to you

Latest news