Breaking : కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్సార్‌టీపీ విలీనం.. కాసేపట్లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు షర్మిల.

-

కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనం ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. రెండు పార్టీల మధ్య ఈ మేరకు అవగాహన కుదిరినట్లు సమాచారం. కాంగ్రెస్ లో షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు, షర్మిల కోరిక మేరకు తెలంగాణలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Experts say Y S Sharmila is likely to dent Congress vote share in Telangana  | Hyderabad News - Times of India

ఈ నేపథ్యంలోనే కాసేపట్లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వైఎస్‌ షర్మిల చేరుకోనున్నారు. ఢిల్లీ నుంచి వచ్చే ఫ్లైట్ లో వస్తున్న షర్మిలతో పాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరి కొంత మంది ఎంపీ లు ఉన్నారు. కాంగ్రెసు పార్టీలో వైఎస్సార్‌టీపీ విలీనం వార్తల నేపథ్యంలో ఎయిర్‌ పోర్ట్ కి వైఎస్సార్‌టీపీ నేతలు చేరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news