చంద్రబాబు చేతిలో కన్నా రాజకీయ భవిష్యత్ శూన్యం – మంత్రి అంబటి

-

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు చేతిలో కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ భవిష్యత్తు శూన్యం అని విమర్శించారు మంత్రి అంబటి రాంబాబు. కన్నా లక్ష్మీనారాయణ టిడిపిలో చేరితే ఎవరికి ఎలాంటి నష్టం లేదని అన్నారు. కన్నా తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వ్యక్తి అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి పదవులు అనుభవించి చివరికి దానికి రాజీనామా చేసి చివరి క్షణంలో బిజెపిలో చేరాడని కీలక వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు కన్నా లక్ష్మీనారాయణని బిజెపి అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారు అందరికీ తెలుసు అన్నారు. ఇక కన్నా లక్ష్మీనారాయణకు జనసేనలో బేరం కుదరక టిడిపిలో చేరారని ఆరోపించారు. కన్నా గురించి ఎవరూ ఆలోచించడం లేదని.. కానీ ఆయన నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇక మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనం తుప్పుపట్టేలా ఉందంటూ ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news