టీడీపీకి అభ్యర్థులను పెట్టుకునే దిక్కే లేదు…మంత్రి అనిల్ సంచలనం…!

-

టీడీపీ కి ఎన్నికల్లో అభ్యర్థులను పెట్టుకునే దిక్కు కూడా లేదని వైసీపీ నేత మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. 54 స్థానాల్లో వైసిపి విజయభేరి మోగించింది అంటూ వ్యాఖ్యానించారు. అనైతిక పొత్తులకు వెంపర్లాడుతున్నారని 40వ డివిజన్ లో ప్రపోజల్ చేయడానికి ఆ పార్టీకి ఒక వ్యక్తి కూడా లేని దుస్థితిలో ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులను నిలబెట్టుకోవడం చేతకాక తాము బెదిరించామని అవాస్తవాలను చెప్పడం సరికాదని అన్నారు.

41వ డివిజన్ లో కనీసం ఆ పార్టీ అభ్యర్థిని ప్రపోజల్ చేసేందుకు ఒక మనిషి రాలేదన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనైతిక పద్ధతులకు పాల్పడుతున్నారు అని ధ్వజమెత్తారు. సిపిఎం పార్టీ తో చర్చలు విఫలమయ్యాయని… సీపిఐ కి ఒక సీటు కేటాయించారని.. మరోవైపు జనసేన తో చర్చలు జరపడం చేశారని అన్నారు. ఇంతకంటే దిగజారుడు రాజకీయాలు ఉండమని అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొత్తం 54 స్థానాల్లో వైసీపీ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news