మగాడివైతే చిటికవేయి..దమ్ముంటే బయటికి రా తేల్చుకుందాం : లోకేష్ కు ఏపీ మంత్రి సవాల్

-

నెల్లూరు :టిడిపి నేత నారా లోకేష్ పై ఏపీ మంత్రి అనిల్ కుమార్ విరుచుకుపడ్డారు. లోకేష్ తండ్రికి పిచ్చి పట్టింది, తండ్రికి మానసిక స్థితి బాలేదు, లోకేష్ నీకు పదవి లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అనిల్ కుమార్. ఇంకో నెలలో ఎమ్మెల్సీ పదవి పోతుందని… నువ్వు సర్పంచ్, కార్పొరేటర్, జెడ్పిటిసి గా ఎక్కడ కూడా గెలవలేవని ఎద్దేవా చేశారు. మీ నాన్న అధ్యక్ష పదవి ఇచ్చే పరిస్థితి లేదు…రాజ్యసభ పదవి ఇవ్వడు… మీ నాన్న చంద్రబాబు దగ్గరికి వెళ్లి చిటిక వెయ్యి… అంతేగాని జగన్ గురించి మాట్లాడుకు అని లోకేష్ కు చురకలు అంటించారు. మగాడివైతే.. బయటికి వచ్చి చిటికవేయి అప్పుడు తేల్చుకుందామని సవాల్ విసిరారు.

కౌన్సిల్ కి వస్తావు కదా.. మా ముందు చిటికె వేసి మాట్లాడు చూద్దామని హెచ్చరించారు. ఇంట్లో కూర్చుని ఐదో తరగతి పిల్లవాడు మాట్లాడుతాడని.. దమ్ముంటే బయటికి వచ్చి మాట్లాడు అని ఫైర్ అయ్యారు. ఉంటే పోతారు.. ఉంటే పోతారు.. అంటున్నావు.. ఉన్న ఏమి పీకలేవు అని మండిపడ్డారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని తట్టుకోలేకపోయారు.. ఈరోజు తట్టుకోగలరా ? అని ప్రశ్నించారు. సింహం వేటాడాల్సిన అవసరం లేదని.. ఒక చూపు చాలని పేర్కొన్నారు మంత్రి అనిల్ కుమార్.

 

Read more RELATED
Recommended to you

Latest news