దారుణం.. యువకుడిని కట్టేసి యువతిని లాక్కెళ్లి గ్యాంప్ రేప్

-

గుంటూరు: తాడేపల్లిలో దారుణం జరిగింది. సీతానగరం కృష్ణానది ఒడ్డున ఏకాంతంగా ఉన్న ప్రేమజంటపై కొందరు గుర్తు తెలియని యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. యువకుడిని కట్టేసి యువతిని లాక్కెళ్లి సాయూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆదివారం తెల్లవారుజామున తాడేపల్లి పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం యువతిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువతిపై బ్లేడ్ బ్యాచ్ అత్యాచారం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బ్లేడ్ బ్యాచ్ సభ్యులను విచారిస్తున్నారు.

అయితే బాధితురాలు అమ్మ స్పందించారు. తన కూతురు కాబోయే భర్తతో కలిసి కృష్ణ నదిలోని పుష్కర ఘాట్ వద్దకు వెళ్ళిందని తెలిపారు. బ్లేడ్ బ్యాచ్‌లోని ముగ్గురు ఆ జంటపై దాడి చేసి సామూహిక అత్యాచారం చేశారని చెప్పారు. ఇద్దరి కాళ్ళు చేతులు కట్టేశారని పేర్కొన్నారు. బాధితురాలు ఫోన్ చేసి చెప్పటంతోనే తాము నది వద్దకు వెళ్ళామన్నారు. పోలీసులు నదిలో మూడు గంటల సేపు నిందితుల కోసం గాలించారని, ప్రస్తుతానికి యువతి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉందని ఆమె తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news