సీఈసీ నిమ్మగడ్డ పై మంత్రి చెరుకువాడ సంచలన వ్యాఖ్యలు…!

-

నిమ్మగడ్డ రమేష్ కుమార్ పార్టీలతో రహస్య సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారో అర్ధం కావడంలేదన్నారు ఏపీ గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రభుత్వంతో పని లేదా? ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఇతర పార్టీల అభిప్రాయాలు తీసుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు.


స్థానిక ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు వేరే ఉద్దేశాలు ఉన్నాయన్నది దీంతో అర్థం అవుతుందని ఇప్పుడు కరోనా పరిస్థితి తీవ్రంగా ఉందని ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేం అని మాత్రమే ప్రభుత్వం తెలిపిందన్నారు. ఎన్నికలకు భయపడాల్సిన పరిస్థితిలో తాములేమని ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టు వరకు వెళ్లి పోరాడింది మేమే అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news