బండి సంజయ్ పై ఆ మంత్రి సడన్ ఫైరింగ్ అందుకేనా

-

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బిజేపిపై సడన్ గా స్వరం పెంచడానికి కారణం ఏంటి ? తన సోదరుడు ప్రదీప్ రావు బిజేపిలోకి వెళ్లేందుకు అంతా సిద్దం కావడంతో మత్రి ఆత్మరక్షణలో పడిపోయారా…ఇంత కాలం బిజేపి నుంచి టిఆర్ఎస్ పై ,ప్రభుత్వంపై వస్తోన్న విమర్శల విషయంలో ఆచితూచి స్పందించే మంత్రి ఎర్రబెల్లి తాజాగా బిజేపిపై ఓ రేంజ్ లో స్వరం పెంచడంపై రాజకీయంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉంటూ వచ్చిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయకర్ ను మంత్రి పదవి వరించింది .తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండవ సారి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా చాన్స్ దక్కించుకున్నారు ఎర్రబెల్లి .గతంలో జిల్లాలు ,సామాజిక సమీకరణాలు కలిసి రాకపోవడంతో మంత్రి కాలేకపోయారు ఎర్రబెల్లి .ఇప్పుడు తాజాగా ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు బిజేపిలోకి వెళ్లేందుకు అంతా సిద్దం అయినట్టు ప్రచారం జరుగుతోంది.

తన సోదరుడు ప్రదీప్ రావు బిజేపికి వెళ్లడం ఖరారు కావడంతో …ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యూహత్మకంగా స్వరం పెంచారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది .తెలంగాణలో టిఆర్ఎస్ ,బిజేపి నేతల మద్య మాటల తూటాలు పేలుతున్నాయి .ఇటువంటి పరిస్థితుల్లో బండి సంజయ్ పై ఫైర్ అవడం ద్వారా రాజకీయంగా తన స్థానంను కాపాడుకునే ఎత్తుగడ ఎర్రబెల్లి వేసారన్న వాదనలు వినిపిస్తున్నాయి .కేసిఆర్ ను జైలుకు పంపే దమ్ము ఉందా అని బండి సంజయ్ ను ప్రశ్నించారు ఎర్రబెల్లి .బండి సంజయ్ ను రాష్ట్రానికి ఏం చేసాడో …కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం తెచ్చాడో చెప్పగలవా అని నిలదీసారు ఎర్రబెల్లి.లేదంటే కరీంనగర్ ప్రజలే బండి సంజయ్ ను ఉరికించి కోడతారని ఫైర్ అయ్యారు ఎర్రబెల్లి .

సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు బిజేపికి వెళ్లే పరిస్థితిలో రాజకీయంగా దయకర్ రావుకు ఇబ్బందులు ఉండే అవకాశం లేకపోలేదు .తమ్ముడు ఒక పార్టీ …అన్న మరోక పార్టీ అన్న విమర్శలు కూడా వచ్చే చాన్స్ ఉంది .మరి ఎర్రబెల్లి దయాకర్ బిజేపిపై ఇదే దూకుడును కొనసాగిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది .

Read more RELATED
Recommended to you

Latest news