ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ఢిల్లీ పెద్దలు కుట్రలు పన్నుతున్నారు : మంత్ర ఎర్రబెల్లి

-

మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని వావిలాల, ముత్తారం గ్రామాల్లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి ఎర్రబెల్లి దంపతులు నాట్యం చేశారు. అక్కడ మంత్రి ప్రసంగిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపెడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ఢిల్లీ పెద్దలు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. బీజేపీ కి కాంగ్రెస్‌ పార్టీ వంత పాడుతోందని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు, కార్యకర్తలు తిప్పికొట్టాలని పేర్కొన్నారు మంత్రి ఎర్రబెల్లి. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ప్రతి ఇంటా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని వెల్లడించారు. ‘ కన్న కొడుకు వలె కంటి అద్దాలను పెట్టించిండు. పెద్ద కొడుకు లాగా ఆసరా పింఛన్‌ ఇచ్చిండు. మేనమామ వలె కల్యాణలక్ష్మి ఇచ్చిండు.. పెద్దన్నలాగా రైతాంగానికి రైతు బంధు పంపిండని ’ అని వెల్లడించారు.

Errabelli dayakar rao: ఫొటోలు మంచి జ్ఞాప‌కాల్ని మిగులుస్తాయిః మంత్రి  ఎర్ర‌బెల్లి-Namasthe Telangana

కేంద్రంలోని బీజేపీ ఉపాధి హామీని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతుందని తన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోటర్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తుందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మోటర్లకు మీటర్లు పెట్టే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. రైతుల బాయిల కాడ మోటర్లకు మీటర్లు పెట్టకే పోతే రూ.30వేల కోట్లు ఆపింది వాస్తవం కాదా అని అడిగారు మంత్రి. కేంద్రం సహకరించకున్నా సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగా ల్లో అభివృద్ధి చేస్తున్నారని తెలియచేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news