వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ టీడీపీలో చేరే ప్రసక్తి లేదు – మంత్రి గుమ్మనూరు

-

వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ టీడీపీలో చేరే ప్రసక్తి లేదన్నారు మంత్రి గుమ్మనూరు జయరాం. కర్నూలు మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు మంత్రి గుమ్మనూరు జయరాం. ఈ సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి గుమ్మనూరు జయరాం కామెంట్స్ చేశారు.

వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు పశువుల సంతలో కొన్నట్టు కొనడం ఆనాటి నుంచి వస్తున్న ఆనవాయితీ అన్నారు మంత్రి గుమ్మనూరు జయరాం.వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ టీడీపీలో చేరే ప్రసక్తి లేదు… చంద్రబాబు , లోకేష్ పాదయాత్రకు, వైయస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ పాదయాత్రకు చాలా తేడా ఉందని తెలిపారు. పాదయాత్ర అంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి, సియం జగన్ కుటుంబానికే సొంతం అని…చంద్రబాబు ప్రజలుకు ఏ ఒక్క సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పే ధైర్యం లేదని వెల్లడించారు. వచ్చే 2024 లో కూడా జగన్ సిఎం కావడం ఖాయం అన్నారు మంత్రి గుమ్మనూరు జయరాం.

Read more RELATED
Recommended to you

Latest news