పవన్ కళ్యాణ్ ముందు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలి – మంత్రి కొట్టు సత్యనారాయణ

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ. శ్రీశైలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళితే ఎవరూ రానివ్వలేదని.. ఒక్క నడ్డాతో అవకాశం దొరికిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు బాటలో వెళితే జన్మలో ముందుకి వెళ్లలేవు అని ఢిల్లీ పెద్దలు పవన్ కళ్యాణ్ కి తేల్చి చెప్పారని అన్నారు. పవన్ కళ్యాణ్ ముందు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు కొట్టు సత్యనారాయణ.

 

ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షం చనిపోయిందని, జగన్ ప్రభుత్వాన్ని దించే పరిస్థితి లేదని, ప్రజలందరూ జగన్ వెంటే ఉన్నారని అన్నారు. ఇక తెలంగాణలో ఓటుకు నోటితో దొరికిపోయిన దొంగలు ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలను కోట్లతో కొనేసి ఒక ఎమ్మెల్సీ గురించి ట్రైలర్ అంటున్నారని మండిపడ్డారు. దమ్ముంటే 19 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లి గెలవమనాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news